తానా అభిమానులకు, సభ్యులకు శుభవార్త. పొద్దున లేచింది మొదలు వ్యక్తిగతం, వ్యావహారికం అనే తేడా లేకుండా ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం, కోర్టులో కేసులు పెట్టుకోవడం వంటి చర్యలతో బిజీగా బతికే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు చెందిన పలు గ్రూపుల నేతలు శనివారం మధ్యాహ్నం డెలావేర్లోని ఓ ఫాంహౌజ్ వద్ద జేరి బాల్యమిత్రుల మాదిరి సరదాగా చెట్టాపట్టాలేసుకుని ఆడిపాడారు. వీరి కలయిక చూసి ప్రవాసులు హర్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాఘురామరాజు పాల్గొన్నారు.
జులై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియాలో జరగనున్న 23వ తానా మహాసభలకు ఇప్పుడిప్పుడే అతిథుల రాక ప్రారంభమైంది. అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4) వారాంతం ముగిశాక వచ్చే వారాంతంలో సభలు జరుగుతుండటంతో ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు తానాలోని అన్ని గ్రూపుల నేతలు, ప్రతినిధులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారు.
సరదా సాయంకాల సందడిలో పాల్గొన్న వారిలో అధ్యక్షుడు అంజయ్య, తదుపరి అధ్యక్షుడు నిరంజన్, మాజీ అధ్యక్షుడు వేమన సతీష్, తాళ్లూరి జయశేఖర్, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి డా.కొడాలి నరేన్, విద్యా గారపాటి, కోయా హరీష్, మన్నం రమణ, వల్లేపల్లి శశికాంత్, కోయా రమాకాంత్, వంశీ వాసిరెడ్డి, సుమంత్ రామిశెట్టి, ఉప్పుటూరి రాంచౌదరి, మన్నే సత్యనారాయణ, చందు గొర్రెపాటి, వుయ్యూరు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తానా అభిమానులకు కనువిందు. చెట్టాపట్టాలేసుకుని ఆడిపాడిన తానా గ్రూపుల నేతలు.
Related tags :