Politics

తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం

తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం

తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు క్యాబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకుగాను అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. 43, 373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కీలక నిర్ణం తీసుకుంది. ఈరోజు సుదీర్ఘంగా సాగిన కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించే బిల్లును మూడో తారీఖున నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపాడు. ఈ మేరకు సంబంధిత నేతలకు, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన విధివిధానాలపై సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.