NRI-NRT

భారత్‌కు ఆఫ్ఘానిస్థాన్ గుడ్‌బై

భారత్‌కు ఆఫ్ఘానిస్థాన్ గుడ్‌బై

భారత్‌లో నేటి (అక్టోబర్‌ 1) నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆఫ్గానిస్థాన్‌ రాయబార కార్యాలయం ప్రకటించింది. తమ దేశం పట్ల భారత్‌ ఆసక్తి చూపకపోవడం, దౌత్యపరంగా తగిన మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘భారత్‌, ఆఫ్గానిస్థాన్‌ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలను, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని.. అన్ని విధాలుగా ఆలోచించే భారత్‌లో మా దౌత్యపరమైన కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఇందుకు మేమెంతో చింతిస్తున్నాం’’అని ప్రకటనలో పేర్కొంది.