Politics

జగన్ సర్కార్ శుభవార్త

జగన్ సర్కార్ శుభవార్త

ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. సొంతింటి పండుగను ఏపీ ప్రజలకు అందించనున్నారు సీఎం జగన్‌. రేపు ఒకేరోజు 5 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. రేపు పేదల చేతికి ఇళ్లు అందించనున్నారు.ఈ లెక్కన ప్రతి మహిళ చేతికి రూ.15 లక్షల విలువైన స్థిరాస్తి అందించనున్నారన్న మాట. ఇక రేపు సామర్లకోటలో ఈ ఇళ్ల ప్రారంభోత్సవం ఉండనుంది. అక్కడ 2 వేలకు పైగా ఇళ్లల్లో గృహప్రవేశాలు జరుగనున్నాయి.

స్వయంగా పాల్గొననున్న సీఎం జగన్…ఒకేరోజు 5 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నారు. కాగా, నిన్న పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారు వైయస్‌.జగన్‌. బస్సు యాత్ర మీటింగుల ఏర్పాట్లను సమన్వయ పరచడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకులను నియమించారు వైస్‌.జగన్.