Politics

సింగరేణి ఎన్నికలు వాయిదా

సింగరేణి ఎన్నికలు వాయిదా

ఈ నెల 28వ తేదీన జరగనున్న సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 27వ తేదీకి సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా, ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మికశాఖ సిద్ధమయ్యింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇవాళ తీర్పు వెలువరించింది. ఎన్నికలను వాయిదా వేయాలన్ని సింగరేణి యాజమన్యం అభ్యర్థనకు హైకోర్టు ఓకే చెప్పింది. దీంతో డిసెంబర్ 27 తేదీకి సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి.

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z