Sports

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సీఏ ప్యానెల్‌ అభ్యర్థి జగన్‌ మోహన్‌రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్‌పై రెండు ఓట్ల తేడాతో జగన్‌ మోహన్‌రావు గెలుపొందారు. హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా దళ్జిత్‌ సింగ్ (గుడ్‌ గవర్నెన్స్‌ ప్యానెల్‌), సెక్రటరీగా దేవరాజు (క్రికెట్‌ ఫస్ట్‌ ప్యానెల్‌), జాయింట్‌ సెక్రటరీగా బసవరాజు (గుడ్‌ గవర్నెన్స్‌ ప్యానెల్‌), కోశాధికారిగా సీజే శ్రీనివాసరావు, (యునైటెడ్‌ మెంబర్స్‌ ప్యానెల్‌), కౌన్సిలర్‌గా సునీల్‌ అగర్వాల్‌ (క్రికెట్‌ ఫస్ట్‌ ప్యానెల్‌) గెలుపొందారు.

హెచ్‌సీఏ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన అసోసియేషన్‌ ఎన్నికల్లో మొత్తం 173 మంది సభ్యులకు గాను 169 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌తో పాటు వెంకటపతిరాజు, మిథాలీరాజ్‌, మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z