DailyDose

గ్రూప్ -2 అభ్యర్థులకు గుడ్ న్యూస్

గ్రూప్ -2 అభ్యర్థులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపిలాంటి ఓ శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు వీలు అయినంత వరకు మేలు చేయాలని ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆలోచనకి అనుగుణంగా గ్రూప్ టు లో అదనంగా 212 కొత్త పోస్టులను పెంచుతూ తాజాగా ప్రభుత్వము ఒక జీవోను విడుదల చేసింది. గతంలోనే గ్రూప్ లో 58 పోస్టుల భర్తీకి ప్రభుత్వము జీవో జారీ చేసింది. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల అభ్యర్థనకు సీఎం సానుకూలంగా స్పందించారు.సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అన్ని విభాగాలను మరొకసారి ఖాళీలకు సంబంధించిన వివరాలను తెప్పించుకుంది జీఏడీ. ఇక పరిశీలన తరువాత అదనంగా 212 పోస్టులను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో నిరుద్యోగులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 పోస్టులు పెరగడంతో నిరుద్యోగులు పండుగలకు సైతం సొంత ఊర్లకు వెళ్లకుండా కోచింగ్ సెంటర్ల వద్దనే శిక్షణ పొందుతూ సన్నద్ధం అవుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z