న్యూజిలాండ్తో మ్యాచ్లో స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు పెవిలియన్కు చేరినా.. సమయోచిత ఇన్నింగ్స్తో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టీమ్ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు. సెంచరీకి చేరువగా వచ్చి 95 పరుగుల వద్ద ఔటైనా సరే అతడి అద్భుత ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ను భారత్ మట్టికరిపించడంలో కింగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో కోహ్లీ ఇన్నింగ్స్పై టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సెంచరీ చేయకపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్స్గా దీనిని అభివర్ణించాడు. అలాగే తొలి మ్యాచ్ ఆడిన షమీతోపాటు రవీంద్ర జడేజాను కూడా అభినందించాడు.
‘‘విరాట్ కోహ్లీ నుంచి మరో అద్భుతమైన ఇన్నింగ్స్. తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఇలాంటి ఆటతీరును ప్రదర్శించడం అద్భుతం. అందుకే నువ్వు G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్). చివరి వరకూ గేమ్ను తీసుకెళ్లిన తీరు సూపర్బ్. రవీంద్ర జడేజా మంచి భాగస్వామ్యం అందించాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించాడు. షమీ సూపర్ స్పెల్తో అదరగొట్టావు’’ అని యువీ ట్వీట్ చేశాడు.
👉 – Please join our whatsapp channel here –