మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి సైతం కాంగ్రెస్లోకి విజయశాంతి రాకను దృవీకరించారని, ఆమె మరో రెండు మూడు రోజుల్లో బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్లో చేరుతున్నానంటూ వస్తోన్న వార్తలపై విజయశాంతి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ తప్పని ఆమె కొట్టి పారేశారు. బీజేపీని వీడటం లేదని.. అదంతా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. బీజేపీని వీడుతున్నారన్న వార్తలను ఆమె ఖండించారు. ఇవాళ పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోడీ సభకు హాజరైన తాను.. బీజేపీని ఎందుకు వీడుతానో అర్థం చేసుకోవాలన్నారు. పార్టీ మార్పు వార్తలపై ఎట్టకేలకు విజయశాంతి క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు చెక్ పడింది.
👉 – Please join our whatsapp channel here –