Devotional

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్‌

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్‌

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్‌.. న్యూఇయర్‌ సందర్భంగా రెండు రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు, సర్వదర్శనాలు రద్దు చేశారు. డిసెంబర్‌ 31, జనవరి 1వ తేదీన భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీశైల ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

న్యూఇయర్‌ సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండనున్న నేపథ్యంలో భక్తులందరికీ త్వరతిగతిన దర్శనాలు కల్పించడంలో భాగంగా స్వామివారి సర్వదర్శనం, గర్భాలయ అభిషేకాలు కూడా నిలిపివేయనున్నారు. సామూహిక అభిషేకాలు, బ్రేక్‌ టికెట్‌ పొందిన భక్తులకు కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు. ఆర్జిత హోమాలు, అమ్మవారి కుంకుమార్చనలు యథావిధిగా ఉంటాయి. అర్జిత హోమాలు, కుంకుమార్చన టికెట్లు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచామని ఈవో పెద్దిరాజు తెలిపారు.

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z