Health

గబ్బిలాల నుంచి మరో ప్రాణాంతకమైన వైరస్‌

గబ్బిలాల నుంచి మరో ప్రాణాంతకమైన వైరస్‌

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ‘గబ్బిలాల’ నుంచి ఉద్భవించినట్టు శాస్త్రవేత్తు తేల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవే గబ్బిలాల్లే మరో ప్రాణాంతకమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ఇంతవరకు పేరు పెట్టలేదు కానీ.. కరోనా వైరస్ తరహాలోనే ఇది ప్రాణాంతకమైందని, మానవులకు సోకే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ కొత్త వైరస్‌ని ఎకోహెల్త్ అలయన్స్ పరిశోధకులు కనుగొన్నారు. గతంలో చైనాలోని వూహాన్‌లో చేసిన ప్రయోగాలతో ముడిపడి ఉన్న ఈ సంస్థ.. తాజా డెడ్లీ వైరస్‌ని థాయ్‌లాండ్‌లోని ఒక గుహలో కనుగొంది.

ఎకోహెల్త్ అలయన్స్ అధినేత డాక్టర్ పీటర్ దస్జాక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సమావేశంలో.. తాము మునుపెన్నడూ చూడని వైరస్‌ను కనుగొన్నామని పేర్కొన్నారు. థాయ్‌లాండ్‌లోని స్థానిక రైతులు గబ్బిలాల్లోని మలాన్ని తమ పొలాల్లో ఎరువుగా సేకరిస్తున్నారని.. ఆ మలంలోనే ఈ వైరస్ పారుతోందని చెప్పారు. ఈ కొత్త వైరస్ SARS (కరోనా వైరస్)కి దగ్గిర సంబంధం కలిగి ఉందని కుండబద్దలు కొట్టారు. మానవులకు సోకే సామర్థ్యం కలిగిన ఈ వైరస్.. ఒకవేళ మానవులకి సోకితే మాత్రం మరింత ప్రమాదాన్ని సృష్టించగలదని హెచ్చరించారు. థాయ్‌లాండ్ రైతులు తరచూ గబ్బిలాల మలాన్ని ఎరువుగా వాడుతున్నారు కాబట్టి, అందులోని వైరస్ భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్ని తీసుకురావొచ్చని పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా.. జేఎన్.1 సబ్-వేరియంట్ కేసులు ఎక్కువ మోతాదులో నమోదవుతున్నాయి. 50 దేశాల ఆసుపత్రుల్లో కొత్తగా చేరిన వారి సంఖ్య 40 శాతానికి పెరిగిందని WHO నివేదించింది. డిసెంబర్ నెలలో దాదాపు 10 మరణాలు నమోదు అయ్యాయని WHO వెల్లడించింది. అయితే.. ఈ కొత్త సబ్-వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ప్రజారోగ్య ప్రమాదాల్ని తక్కువగా కలిగిస్తోందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో.. గబ్బిలాల్లో కనుగొన్న కొత్త డెడ్లీ వైరస్ గురించిన వివరాల్ని ఎకోహెల్త్ అలయన్స్ సంస్థ అధినేత వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z