Politics

భారాస ప్రభుత్వం అందించిన సహకారమే దీనికి ప్రధాన కారణం!

భారాస ప్రభుత్వం అందించిన సహకారమే దీనికి ప్రధాన కారణం!

పవర్‌ లూమ్‌ వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. సిరిసిల్ల పవర్‌ లూమ్‌ పరిశ్రమపై ఆయన ట్వీట్‌ చేశారు. గత పది సంవత్సరాల్లో అక్కడ పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని.. నేతన్నల జీవితాలు మెరుగుపడటమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని పేర్కొన్నారు. భారాస ప్రభుత్వం అందించిన సహకారమే దీనికి ప్రధాన కారణమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్‌ లూమ్‌ పరిశ్రమకు అండగా నిలవాలని.. బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని.. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళుతుందని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z