Politics

అధికారం మనదే…రోలుపడి పర్యటనలో కేశినేని చిన్ని

Kesineni Sivanath Chinni Tours Tiruvuru Mandal Rolupadi

* మనం వాళ్ల కుర్చీలు ఖాళీ చేద్దాం.
* బ్రహ్మరథం పట్టి, మంగళహారతులు ఇచ్చిన మహిళలు.
* అడుగడుగునా జన నీరాజనాలు
* కుల మతాలకతీతంగా ర్యాలీలో పాల్గొన్న గ్రామస్థులు

సి.యం జగన్ కాలర్లు మడత పెడతానంటున్నాడు…మనం వాళ్ల కుర్చీలు ఖాళీ చేద్దాం…అధికారంలోకి రాబోయేది మనమేనని విజయవాడ పార్లమెంట్ తెదేపా నాయకుడు కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలంలోని రాజీవ్ నగర్, సూరవరం, రోలుపడి, చింతలపాడు, ఎరుకోపాడు, గొల్లగూడెం ఆయన తిరువూరు టిడిపి ఇన్చార్జ్ శావల దేవదత్తుతో కలిసి పర్యటించారు.

చిన్నికి గ్రామ ప్రజలు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలకగా, గ్రామాల్లో మహిళలు అడుగడుగునా హారతులు ఇస్తూ బ్రహ్మ రథం పట్టారు. కులమతాలకతీతంగా నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కేశినేని శివనాథ్(చిన్ని) మాట్లాడారు. ఈ జన సందోహం చూస్తుంటే టిడిపి గెలుపు తిరువూరులో ఇప్పుడే కనిపిస్తుంది అని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరగాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమన్నారు. గ్రామాలలోని అన్ని సమస్యలను రాబోయే టిడిపి ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. కేశినేని శివనాథ్ గారు ఈ పర్యటనకు ముందు కోకిలంపాడు గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు.

ఈ పర్యటనలో రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కొత్తపల్లి ఆనంద్ స్వరూప్, కొలికెపూడి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు వెదురు వెంకట నర్సిరెడ్డి రెడ్డి, రోలుపడి పంచాయతీ పార్టీ అధ్యక్షులు కిలారు రమేష్, మాజీ జెడ్పిటిసి కిలారు బిందు, సురవరం గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, గ్రామ పార్టీ జనసేన నాయకులు కంబాల మురళి తదితరులు పాల్గొన్నారు.



👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z