Business

ఇండియాలో క్రిప్టో కరెన్సీపై పన్ను బాదుడు-BusinessNews-Mar 14 2024

ఇండియాలో క్రిప్టో కరెన్సీపై పన్ను బాదుడు-BusinessNews-Mar 14 2024

* 2022 యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం అధికారికంగా క్రిప్టో ఆస్తులతో సహా డిజిటల్ ఆస్తులను వర్చువల్ డిజిటల్ ఆస్తులుగా వర్గీకరించింది. మీరు క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లో రూ. 1,00,000 విలువైన షేర్లను విక్రయించారని అనుకుందాం. వివిధ సంస్థలు డిజిటల్ కరెన్సీలలో కొనుగోలు చేయడంతో పాటు విక్రయించడానికి క్రిప్టోకరెన్సీ మార్పిడి చేయడానికి పెట్టుబడిదారులకు సహాయపడుతుంది. ఈ షేర్ల విక్రయం ద్వారా మీరు రూ. 50,000 లాభం పొందారని అనుకుంటే ఇప్పుడు రూ.50,000 బదులు రూ.32,500 మాత్రమే మీ ఖాతాలో జమ అవుతుంది. అంటే రూ.50,000 లాభంపై 1 శాతం టీడీఎస్, ఫ్లాట్ రేట్ 30 శాతం పన్ను, 4 శాతం సెస్ చార్జీ విధిస్తారు. ఇప్పుడు లాభాలపై మీ మొత్తం పన్ను రేటు 35 శాతం అవుతుంది అంటే మీరు రూ. 50,000 లాభంపై రూ. 17,500 పన్ను చెల్లించాలి.

* దేశవ్యాప్తంగా మరిన్ని జనౌషధి కేంద్రాలను ప్రారంభించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తక్కువ ధరకు రుణాలు అందజేస్తుందని చాలా మంది సమాచారం ఉండదు. అలాంటి దుకాణాలపై ఆసక్తి ఉన్న వ్యక్తులు ఇప్పుడు సరసమైన ధరలకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ రుణాలను మానిటర్ చేస్తుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు జనౌషధి కేంద్రాల వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ దరఖాస్తును పూరించాల్సి ఉంటుంది. అనంతరం ఆ తర్వాత వారి కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభమైన ప్రక్రియగా ఉంటుంది. జనౌషధి కేంద్రానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ప్రాథమిక అనుమతి ఇస్తారు. అదే ఆధారంగా తీసుకుని డ్రగ్ లైసెన్స్ పొందడం ద్వారా తమ దుకాణాన్ని ఏర్పాటు చేయవచ్చు. జన ఔషధి దుకాణాల ఏర్పాటు కోసం స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) నుంచి రూ.4 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ రుణం వ్యక్తికి జీఎస్టీ సహాయక్ ప్లాట్‌ఫారమ్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. రుణాలు మంజూరైన వ్యక్తులు ఆ డబ్బును దుకాణానికి ఫర్నిచర్, కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఇతర మార్గాల ద్వారా సహాయం అందుబాటులో ఉండదు. ఈ రుణాలతో ఈ ఖర్చులన్నీ సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటాయి. ఈ జనౌషధి కేంద్రాలలో ఔషధాల సరఫరా నిర్వహణకు నిధులు సమకూర్చేందుకు ఎస్ఐడీబీఐతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటే మరింత తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉంటాయి.

* ఎన్నికల నేపథ్యంలో చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం చార్టర్డ్ విమానానికి గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అలా అయితే చార్టర్డ్ విమానాల అద్దె, హెలికాప్టర్‌కు గంటకు 1.5 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశంలో 350 చార్టర్డ్ విమానాలు, 175 హెలికాప్టర్లు ఉన్నాయి.

* పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ పొదుపు చర్యలు చేపట్టింది. ఆదా చర్చల్లో భాగంగా ఇటీవల 1000 మందిని తొలగించిన పేటీఎం.. తాజాగా సుమారు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల వార్షిక పనితీరు ఆధారంగా వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారిని తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పేటీఎం తన కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సొల్యూషన్స్ అమలుపై కేంద్రీకరించడం కూడా ఉద్యోగుల తొలగింపునకు మరో కారణం అని సమాచారం. హెచ్ఆర్ విభాగం అధికారులు వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఒక్కొక్కరిని పిలిచి తొలగిస్తున్నట్లు చెబుతున్నారని పేటీఎం ఉద్యోగులు చెబుతున్నారు.

* అమెరిక‌న్ సెమీకండ‌క్ట‌ర్ త‌యారీదారు క్వాల్‌కాం చెన్నైలో డిజైన్ సెంట‌ర్‌ను ప్రారంభించింది. ఈ డిజైన్ సెంట‌ర్‌ను కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈవో క్రిస్టియానో అమ‌న్ స‌మ‌క్షంలో కేంద్ర స‌మాచార‌, సాంకేతిక శాఖ మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్ గురువారం ప్రారంభించారు.

* దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. నిన్న సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకోగా.. లక్షలాది కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైనా ఆ తర్వాత సూచీలు కోలుకొని లాభాల్లో పయనించాయి. చివరి వరకు సూచీలు గ్రీన్‌ మార్క్‌లోనే కొనసాగాయి. సెన్సెక్స్‌ మరోసారి 73వేల మార్క్‌ను దాటింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z