సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులు డాక్టర్ బి.బాలబాస్కర్, పర్వతనేని హరీష్
ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా జర్మనీ, నార్వే దేశ అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం, ఇదే అంశంపై ఏపీఐఐసీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పలు అంశాలపై చర్చ, అక్కడ చర్చించిన అంశాలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్ళిన రాయబారులు
రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులు, సులభతర వాణిజ్యం కోసం అమలుచేస్తున్న ప్రణాళికలను రాయబారుల దృష్టికి తీసుకెళ్ళిన సీఎం
వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యాన ఉత్పత్తులు, మత్స్య సంపద, చేనేత, టెక్స్టైల్, టూరిజం రంగాలలో అవకాశాలపై ఈ సమావేశంలో చర్చ
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హర్బర్లు, పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, ఎంఎస్ఎంఈలతో ఒప్పందాలు, పాలసీలు, టెక్నాలజీ అప్గ్రేడేషన్, డీకార్బనైజేషన్ వంటి కీలక అంశాలపై సీఎం, రాయబారుల మధ్య చర్చ
నాణ్యతతో కూడిన ఉత్పత్తులకు ప్రాధాన్యతినిస్తూ అధిక మొత్తంలో ఆయా దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాయబారులకు తెలిపిన సీఎం
ఇక్కడ నర్సింగ్ చదువుతున్న విద్యార్ధులకు జర్మనీలో విస్తృతంగా అవకాశాలు కల్పించేలా వారు కోర్సు చదివే సమయంలో అక్కడికి తగిన విధంగా బాషా శిక్షణ, కరిక్యులమ్ అందుబాటులోకి తీసుకురావాలని జర్మనీలో భారత రాయబారిని కోరిన సీఎం, సానుకూలంగా స్పందించిన రాయబారి
నాణ్యమైన, రుచికరమైన కాఫీ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్, ప్రొడక్టివిటీ పెంచేలా తగిన సహకారాలు అందించాలని కోరిన ముఖ్యమంత్రి, తప్పనిసరిగా తమ సహకారం ఉంటుందని ఇరుదేశాల రాయబారులు హామి.
ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై ఇరుదేశాల రాయబారులకు వివరించిన ముఖ్యమంత్రి
ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, ప్రణాళికా శాఖ కార్యదర్శి జి. విజయ్కుమార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన.