NRI-NRT

తానాకు ₹35లక్షలు విరాళం ఇచ్చిన బత్తినేని సోదరులు

Battineni Brothers From Khammam Donates 35Lakhs To TANA DC Convention

ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ ప్రవాస సోదరులు బత్తినేని ప్రకాష్, రాజేష్‌లు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మహాసభలకు భారీ విరాళాన్ని అందించారు. జులై మొదటి వరంలో వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న తానా 22వ మహాసభల నిర్వహణకు నిమిత్తం ₹35లక్షలు విరాళాన్ని బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు. వీరిరువురూ గతంలో తానా కార్యవర్గ సభ్యుల హోదాలో పలు సేవలు అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో అనేక వాటర్ ప్లాంటుల నిర్మాణం, క్యాన్సర్ క్యాంపులు, కంటి వైద్య శిబిరాలు, పలు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన బల్లలు, పుస్తకాలు, కంప్యూటర్లు, చిత్రాలు వంటి వాటికి దాతలుగా వ్యవహరించి సేవా కార్యక్రమాల రూపేణా సహకరించారు. తానా 22వ మహాసభలకు ఇంతటి భారీ విరాళాన్ని అందించిన బత్తినేని సోదరులకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన ధన్యవాదాలు తెలిపారు.