మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ట్విటర్లో చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ‘తుఫాను ఎక్కడ తీరం దాటేది నాకు ముందే తెలుసు. హైదరాబాద్ ను నేనే నిర్మించా. నా విజన్-2020 డాక్యుమెంటును అబ్దుల్ కలాం కాపీ కొట్టారు అని చంద్రబాబు పదే పదే చెప్తుంటారు. ఇదంతా ఆయన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారనటానికి ఉదాహరణే అన్నారు. సూడోలాజియా ఫెంటాస్టికా (pseudologia fantas´tica) అనే మానసిక రుగ్మత వల్లే ఇలా అయిపోయారు పాపం. తర్కానికందని కోతలు కోయడం దీని లక్షణమే అని విజయసాయిరెడ్డి అన్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం ప్రతి విద్యార్థి హక్కు. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో మాత్రమే బోధన జరగాలనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. బలహీన వర్గాల వారిని ఇంకా ఎంత కాలం మీ పిల్లలు, మనవళ్లు చదువుకునే ఆంగ్ల మాధ్యమానికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తారు బాబూ?’ అని విమర్శించారు.
ఆయన మానసిక రుగ్మత పేరు సూడోలాజియా ఫెంటాస్టికా
Related tags :