Politics

వైద్యులతో ఈటెల సమావేశం

Eetela Meets With Doctors And Officials

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిని పూర్తి స్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లో యాక్టివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న నోడల్‌ అధికారులు, వైద్యులతో ఆయన స్వయంగా మాట్లాడారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారమే కరోనా రోగులందరికీ చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు. తాజాగా పలు కీలక మార్పులతో ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ విడుదల చేసిందని, వాటి ప్రకారమే డిశ్చార్జి పాలసీ, హోం ఐసోలేషన్‌, డెత్‌ గైడ్‌లైన్స్‌ను అమలు చేయనుందని తెలిపారు.