NRI-NRT

అమరావతి రైతులకు డీసీ-వర్జీనియా ప్రవాసుల భరోసా

అమరావతి రైతులకు డీసీ-వర్జీనియా ప్రవాసుల భరోసా-Washington DC And Virginia Telugus Support Amaravati Farmers

గత 200 రోజులుగా ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాల్ని కోరుతూ దీక్ష చేస్తున్న అమరావతి రైతులకు మద్దతుగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, వర్జీనియాకు చెందిన ప్రవాసులు శుక్రవారం నాడు కాగడా ప్రదర్శనతో తమ మద్దతు తెలిపారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచన విరమించుకోవాలని, ఆంధ్రుల రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవాసులు వేమన సతీష్, కోయా రమాకాంత్, కొడాలి నరేన్, యాష్, ఎన్.ఆర్.సీ.నాయుడు, నీలిమ తదితరులు పాల్గొన్నారు.
అమరావతి రైతులకు డీసీ-వర్జీనియా ప్రవాసుల భరోసా-Washington DC And Virginia Telugus Support Amaravati Farmers