Movies

ఏడేళ్ల విరామం తర్వాత..

ఏడేళ్ల విరామం తర్వాత..

బాలీవుడ్‌ వెండితెరపై హిట్‌పెయిర్‌గా గుర్తింపును సంపాదించుకున్నారు షారుఖ్‌ఖాన్‌, కాజోల్‌. వీరిద్దరి కలకయిలో వచ్చిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ వంటి చిత్రాలు అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ జంట కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసింది. ‘దిల్‌వాలే’ (2015) తర్వాత ఈ జంట మళ్లీ కలిసి నటించలేదు. తాజా సమాచారం ప్రకారం కరణ్‌జోహార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రాఖీ ఔర్‌ రాణీ’ చిత్రంలో షారుఖ్‌-కాజోల్‌ జోడీ అతిథి పాత్రల్ని పోషించనున్నారట. చాలా కాలం విరామం తర్వాత ఈ సినిమాతో తిరిగి మెగాఫోన్‌ పట్టబోతున్నారు కరణ్‌జోహార్‌. రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలకమైన ఎపిసోడ్‌ను షారుఖ్‌, కాజోల్‌ను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ చేశారట. కరణ్‌జోహార్‌తో తమకున్న అనుబంధం దృష్ట్యా ఈ సినిమాకు షారుఖ్‌, కాజోల్‌ వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.