తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈ ఏడాది అమెరికాలోని ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో బోస్టన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా వర్చువల్గా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది అమెరికాలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో మే 20, 21 తేదీల్లో బోస్టన్లోని బెస్ట్ వెస్ట్రన్ రాయల్ ప్లాజా హోటల్లో నిర్వహించనున్నారు.
ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్గా ఇటీవల నియమితులైన జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఎంవీఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకుడు మన్నవ సుబ్బారావు తదితరులు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో బోస్టన్లో మహానాడు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు జయరాం బోస్టన్లో పర్యటించారు. అతిథులకు అవసరమైన ఏర్పాట్లతో పాటు, మహానాడులో చర్చించే విషయాలపై ఆయన సమీక్ష చేయనున్నారు. ఏపీలో మహానాడును తలపించేలా ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.