NRI-NRT

సౌదీ అరేబియాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

సౌదీ అరేబియాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తన అవిర్భావంతో యావత్తు తెలుగు జాతి ప్రతిష్ఠను పెంపొందించి జాతీయ స్ధాయిలో తెలుగు వారికి ఒక ప్రత్యెక గౌరవాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ అవిర్భావ దినోత్సవాలు గల్ఫ్ దేశాలలో ఉత్సహాంగా జరుగుతున్నాయి.
రియాధ్, దమ్మాం మరియు జుబైల్ నగరాలలో తెలుగు దేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం అవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోంటున్నారు.

ఈ సందర్భంగా రియాధ్ నగరంలో బుధవారం ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ
సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్లమూడి సారధి నాయుడు ఎన్టీఆర్ తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును చేస్తే, నారా చంద్రబాబు నాయుడు ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ గౌరవాన్ని తెచ్చిపెట్టారన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోకూరి దేవ, ముండ్లూరి చలపతిరావు, సుదర్శన్, కిరణ్ కుమార్, కడియాల గౌరయ్య, మంగళగిరి సురేష్, చక్రపాణి, నగరం గుణశేఖర్,చంద్రబాబు,కొడవటి ప్రసాద్ నరసింహారాజు,రామ్మోహన్, కామేశ్వర్, నరసింహం,హేమాద్రి, ఆనంద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.