NRI-NRT

సిలికానాంధ్ర సంజీవనిలో ఉచిత డయాలసిస్ కేంద్రం ప్రారంభం

సిలికానాంధ్ర సంజీవనిలో ఉచిత డయాలసిస్ కేంద్రం ప్రారంభం

తొలి ఏకాదశిని పురస్కరించుకుని కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో శ్రీ సత్యసాయి సంక్షేమ ట్రస్ట్ సహకారంతో ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని (సాయి సౌఖ్యం) ప్రారంభించినట్లు సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సందర్భంగా రోగులకు, వారి సహాయకులకు ఉచిత భోజన సదుపాయాన్ని కూడా ప్రారంభించారు. చింతా రవి బాలకృష్ణ శిష్యులు కూచిపూడి ప్రదర్శన అలరించింది.
సిలికానాంధ్ర సంజీవనిలో ఉచిత డయాలసిస్ కేంద్రం ప్రారంభం