అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించి శాంతియుత అధికార మార్పిడికి అడ్డు తగిలారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలువురికి వార్నింగ్ ఇచ్చారు. తనను వెంటాడి వేధిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, సాక్షులు, కోర్టుపరంగా సంబంధమున్న ఎవరినీ వదలబోనని హెచ్చరించారు. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఈ హెచ్చరికను ఉంచారు. అంతటితో ఆగకుండా న్యాయశాఖ ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్, మరి ఇద్దరు అటార్నీలపై బెదిరింపులతో కూడిన ప్రకటనను టీవీలో ప్రసారం చేయడానికి సన్నద్ధమయ్యారు. దీంతో ట్రంప్ను అడ్డుకోవడానికి న్యాయశాఖ రంగంలోకి దిగింది. సాక్షాధారాలను ట్రంప్ న్యాయ బృందం బయట పెట్టకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని జిల్లా జడ్జి టాన్యా చట్కన్ను కోరింది. అమెరికా భవనంపై దాడి కేసులో నిందితులపై చట్కన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆమె బరాక్ ఒబామా హయాంలో నియమితులయ్యారు. ఆరోపణలపై నిరూపణకు ప్రభుత్వం సమర్పిస్తున్న సాక్ష్యాధారాలను ఆయన వకీళ్లు, సాక్షులు, వారి వకీళ్లు, కోర్టు నియమించిన అధికారులు తప్ప వేరెవరికీ చూపకూడదంటూ ట్రంప్ నిషేధాజ్ఞలు జారీ చేయాలని జడ్జి చట్కన్ను న్యాయశాఖ కోరింది. మరోవైపు ట్రంప్ శుక్రవారం అలమా రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తన మీద మరో కేసు నమోదైతే చాలు.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తానేనని ప్రకటించారు. వాళ్లు తన మీద కేసు పెట్టిన ప్రతిసారీ ప్రజాభిప్రాయ సేకరణలో తనకే మద్దతు పెరిగిపోతోందని చెప్పారు. తనపై కేసులు దాఖలు చేసిన ప్రభుత్వ న్యాయవాదులను బెదిరిస్తూ ట్రంప్ బృందం రూపొందించిన టీవీ వాణిజ్య ప్రకటన సోమవారం వాషింగ్టన్, న్యూయార్క్, అట్లా నగరాలతోపాటు జాతీయ కేబుల్ నెట్వర్క్లో ప్రసారం. మరోవైపు ట్రంప్ శుక్రవారం అలమా రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తన మీద మరో కేసు నమోదైతే చాలు.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తానేనని ప్రకటించారు. వాళ్లు తన మీద కేసు పెట్టిన ప్రతిసారీ ప్రజాభిప్రాయ సేకరణలో తనకే మద్దతు పెరిగిపోతోందని చెప్పారు. తనపై కేసులు దాఖలు చేసిన ప్రభుత్వ న్యాయవాదులను బెదిరిస్తూ ట్రంప్ బృందం రూపొందించిన టీవీ వాణిజ్య ప్రకటన సోమవారం వాషింగ్టన్, న్యూయార్క్, అట్లా నగరాలతోపాటు జాతీయ కేబుల్ నెట్వర్క్లో ప్రసారం. మరోవైపు ట్రంప్ శుక్రవారం అలమా రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తన మీద మరో కేసు నమోదైతే చాలు.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తానేనని ప్రకటించారు. వాళ్లు తన మీద కేసు పెట్టిన ప్రతిసారీ ప్రజాభిప్రాయ సేకరణలో తనకే మద్దతు పెరిగిపోతోందని చెప్పారు. తనపై కేసులు దాఖలు చేసిన ప్రభుత్వ న్యాయవాదులను బెదిరిస్తూ ట్రంప్ బృందం రూపొందించిన టీవీ వాణిజ్య ప్రకటన సోమవారం వాషింగ్టన్, న్యూయార్క్, అట్లా నగరాలతోపాటు జాతీయ కేబుల్ నెట్వర్క్లో ప్రసారం.