Sports

ముగ్గురు భారతీయులకు టైమ్ పత్రికలో చోటు

ముగ్గురు భారతీయులకు టైమ్ పత్రికలో చోటు

మహిళా క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, పాత్రికేయురాలు నందితా వెంకటేశన్‌, ఆర్కిటెక్ట్‌ విను డానియల్‌, శాస్త్రవేత్త నాబరన్‌ దాస్‌గుప్తాల కృషిని, సమాజానికి వారి సేవలను టైం మ్యాగజీన్‌ కొనియాడింది. భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(34) తన దూకుడైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసులను గెలుచుకున్నారని,క్షయ వ్యాధిగ్రస్థులకు తక్కువ ధరకే మందులు లభించేందుకు కృషి చేసిన నందితా వెంకటేశన్‌(33), వాల్‌ మేకర్స్‌ స్టూడియో ద్వారా ప్రాకృతిక ఇళ్లను నిర్మిస్తున్న విను డానియల్‌ లను ఈ గుర్తింపుకు ఎంపిక చేశారు.