Movies

వైరల్ విశాలాక్షి

వైరల్ విశాలాక్షి

హీరో సుధీర్ బాబు సరసన ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించిన ‘మామ మశ్చీంద్ర’ సినిమా విడుదలకు సిద్దమయ్యింది. ‘మామ మశ్చీంద్ర’ లో తాను సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కనిపిస్తానని చెప్పింది ఈషా రెబ్బా. ”ఇందులో నా పాత్ర పేరు వైరల్ విశాలాక్షి. సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చేస్తుంటాను. చాలా హైపర్‌గా ఉంటాను. వైరల్ వీడియోలు చేయడం అంత తేలిక కాదు. ఈ పాత్ర చేస్తున్నపుడు సోషల్ మీడియాలో వీడియోలు చేసేవారి కష్టం తెలిసింది” అని చెప్ప్పుకొచ్చింది ఈషా. ‘మామ మాశ్చీంద్ర’లో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. నటుడు రచయిత హర్షవర్ధన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.