Politics

కలెక్టర్లు ఎస్పీలతో సీఎం భేటీ

కలెక్టర్లు ఎస్పీలతో సీఎం భేటీ

ప్రజాపాలనపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టి సారించింది. జనం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆ దిశగా కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు. 100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు. భారాస పదేళ్ల పాలనపై చర్చించడంతోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నారు. ప్రజావాణిని జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ స్థాయుల్లో పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల ద్వారా సమాచారం తీసుకోనున్నారు. ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z