Sports

2036 ఒలింపిక్స్‌ నిర్వహణపై కేంద్ర హోం మంత్రి అశాభావం

2036 ఒలింపిక్స్‌ నిర్వహణపై కేంద్ర హోం మంత్రి అశాభావం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2036 ఒలింపిక్స్‌ నిర్వహణపై కేంద్ర హోం మంత్రి అశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియం సమీపంలో ఉన్న సర్దార్‌ పటేల్‌ కాంప్లెక్స్‌ ఇందుకు వేదిక కావొచ్చని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్‌కు బిడ్‌ సమర్పిస్తామని ఇప్పటికే ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తన సొంత నియోజకవర్గం గాంధీనగర్‌లో ఓ క్రీడా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టాలని మోదీ సూచించారని తెలిపారు. ‘ఒకవేళ భారత్‌ బిడ్‌ను ఒలింపిక్స్‌ కమిటీ అంగీకరిస్తే సర్దార్‌ పటేల్‌ కాంప్లెక్స్‌లో 2036 ఒలింపిక్స్‌ జరుగుతాయి. ఇప్పటికే దీనికి రూ.4,600 కోట్లను ప్రధాని కేటాయించారు’ అని అమిత్‌ షా తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z