బీజేపీ ( BJP ) ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ( Daggubati Purandeshwari ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ…‘‘ఏపీలోని గ్రామల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుంది. బీజేపీ అభివృద్ధి నిరోధకంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది. గ్రామ సడక్ యోజన వంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి. సమాజంలోని అట్టడుగు ప్రజలకు సంక్షేమం అందించడమే బీజేపీ లక్ష్యం. కేంద్ర నిధులు గ్రామాలకు చేరకపోతే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ఏపీ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాం’’ అని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –