మద్యం తాగి వాహనం నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన వ్యక్తికి పది రోజుల జైలుశిక్ష విధిస్తూ నిజామాబాద్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సయ్యద్ ఖదీర్ బుధవారం తీర్పు చెప్పారు. ఈ నెల 14వ తేదీన నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 23 కేసులు నమోదు కాగా..
వారిని బుధవారం కోర్టులో హాజరుపర్చారు. 22 కేసుల్లో రూ.26,500 ఫైన్ విధించిన మేజిస్ట్రేట్.. ఒక కేసులో నగరంలోని వినాయక్నగర్కు చెందిన బాబు అనే వ్యక్తికి 10 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –