DailyDose

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్

టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత ఏడాది డిసెంబరు 8న జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ‘‘కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది వివక్షతో కూడిన నిర్ణయం. ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఛైర్మన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్‌ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z