Movies

ఆ ఘనత కియారా సొంతం

ఆ ఘనత కియారా సొంతం

వరుస విజయాలతో బాలీవుడ్‌లో కథానాయికగా దూసుకుపోతున్నారు కియారా అద్వాణీ. ‘భూల్‌భూలయ్య2’, 200 కోట్ల రూపాయల వసూళ్లను అందుకోగా ఇటీవలె విడుదలైన ‘జుగ్‌జుగ్గ్‌ జియో’ వందకోట్లను రాబట్టింది. ఈ ఏడాది థియేటర్లలో రెండు వరుస హిట్లను అందుకున్న ఏకైక కథానాయిక కియారా ఒక్కరే. ఆమె నటించబోయే తదుపరి చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ‘సత్య ప్రేమ్‌కీ కథ’ చిత్రంలో ఆమె కార్తీక్‌ ఆర్యన్‌తో జోడీ కట్టబోతున్నారు. ఇందులో ఆమె పాత్ర పేరు కథ. త్వరలోనే ముంబైలో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి తొలుత ‘సత్యనారాయణ్‌ కీ కథ’ అనే టైటిల్‌ను  ప్రకటించగా హిందూ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దాంతో కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఆమె నటించిన ‘గోవిందా నామ్‌ మేరా’ విడుదలకు సిద్ధమైంది. దీంతో ఈ ఏడాది ఆమె ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు శంకర్‌- రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలోనూ కి యారా మెరవబోతున్నారు.