Sports

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆవిష్కరణ

Kareena Kapoor Unveils ICC T20 World Cup-ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆవిష్కరణ

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లను బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా వేదికగా 2020లో మహిళలు, పురుషుల విభాగాల్లో రెండు ప్రపంచకప్‌ ఈవెంట్లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెల్‌బోర్న్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కరీనా పాల్గొని ప్రపంచకప్‌లను ఆవిష్కరించారు. అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలను పంచుకున్నారు. ‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. తమ కలలను సాకారం చేసుకునేందుకు ఆయా దేశాల తరఫున ఆడుతున్న మహిళా క్రికెటర్లను ప్రశంసిస్తున్నా. అంతర్జాతీయ వేదికపై మహిళలను ఇలా చూడటం నిజంగా శక్తిమంతంగా అనిపిస్తుంది. ప్రతీ ఒక్కరికీ ఆ క్రికెటర్లు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. మా మామయ్య మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ కూడా క్రికెటరే. భారత్‌ తరఫున ఆడిన గొప్ప ఆటగాడు‌. ఈ ట్రోఫీని ఆవిష్కరించడం నాకు గర్వకారణం’ అని పేర్కొన్నారు.కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు మహిళా ప్రపంచకప్‌ జరగనుంది. అలాగే అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు పురుషుల మెగా ఈవెంట్‌ జరుగుతుంది.