NRI-NRT

గద్వాల్ కరోనా బాధితులకు పొట్లూరి రవి సాయం

TANA Secretary Potluri Ravi Serves Gadwal COVID19 Victims In Telangana

రెడ్ జోన్ లో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మున్సిపాలిటీలో ఇరవై మందికి కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ కు తరలించడం జరిగింది. రెండు వారాల తర్వాత పరీక్షల్లో నెగటివ్ రావటంతో వారు తిరిగి శాంతినగర్ చేరుకున్నారు. నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతుండటంతో వారికి సహాయం చెయ్యమని మున్సిపల్ కమీషనర్ పార్థసారధి తానా కార్యదర్శి పొట్లూరి రవి ని కోరటంతో తక్షణం స్పందించి వారి ఇండ్ల దగ్గరికే నిత్యావసరాల పంపిణీ చెయ్యడం జరిగింది.