Health

తాటిముంజలకి విపరీతమైన గిరాకీ

Palm Fruit Must Be Taken Without Fail During COVID19 Times

మండుతున్న ఎండల్లో తాటి ముంజలు తింటుంటే… ఎంత బాగుంటుందో కదా… ఇవి ఎండలకు ఉపశమనమే కాదు… ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. కరోనా సమయంలో కూడా వీటికి గిరాకీ బాగానే ఉంది. ఇందూరులో తాటి ముంజల విక్రయాలపై కథనం.

నిజామాబాద్​ పట్టణానికి గ్రామాల నుంచి తీసుకొచ్చి తాటి ముంజలను విక్రయించి ఉపాధి పొందుతున్నారు కొందరు పల్లెవాసులు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సీజన్​లో తాటి ముంజలు గిరాకీ ఉంటుందని ఆశతో విక్రయదారులు ఎదురు చూశారు. కానీ లాక్​డౌన్​ కారణంగా ఈ సీజన్​లో 20 రోజుల గిరాకీ పోయిందని విక్రయదారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆలస్యం కావడం వల్ల తాటి చెట్లపైన ముంజలు ముదిరిపోయాయి.

ఈ కాలంలో తాటిచెట్లకు ముంజలు విరివిగా కాస్తాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సల్ఫర్​, కాపర్​ తదితర పోషక విలువలు కలిగి ఉంటడంతో పాటు మనిషి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతాయి. రక్తహీనతను సైతం తగ్గించడానికి ఎంతో ఉపకరిస్తాయని.. తాటి ముంజల్లో అనేక ఖనిజ లవణాలు దాగి ఉన్నాయని అంటున్నారు. ముంజల్లో ఉన్న చిక్కటి గువ్వ రక్తహీనతను సైతం తగ్గించడానికి ఎంతో ఉపకరిస్తాయి. తాటిముంజల్లో అనేక ఖనిజ లవణాలు దాగి ఉన్నాయి. ముంజల్లో ఉన్న చిక్కటి గువ్వ మనిషి శరీరంలో వేడిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతుంది.చెమట ద్వారా మనం కోల్పోయిన లవణాలను భర్తీ చేసే గుణం తాటి ముంజలకు ఉంటుంది.

ఇలాంటి తాటి ముంజలకు ప్రస్తుతం మంచి గిరాకీ ఏర్పడింది. కొనుగోలు పెరుగుతుండటం వల్ల ముంజల ధరలు పెరిగాయి. ముంజల పరిమాణం, నాణ్యతను బట్టి డజను ధర 70 రూపాయల నుంచి 100 రూపాయలు వరకు పలుకుతుంది. వేసవి వచ్చిందంటే చాలు పట్టణాలు, పల్లెల్లో అనే తేడా లేకుండా గంపల్లో, రోడ్డుపై అమ్ముతున్నారు. దీనితో నగరంలో వ్యాపారం జోరుగా సాగుతోంది.