NRI-NRT

డీసీలో కాల్పులు. నలుగురు మృతి-నేరవార్తలు

డీసీలో కాల్పులు. నలుగురు మృతి-నేరవార్తలు

* విజయవాడ భవానీపురంలో మంత్రి వెల్లంపల్లి అనుచరుడు, వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ ఖాజా అనుచరులు వీరంగం సృష్టించారు.షేక్ దావుద్ అనే టీ కొట్టు వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు.

* నెల్లూరు జిల్లా…బుచ్చిరెడ్డిపాలెం జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం.కృష్ణపట్నం నుండి బొగ్గు లోడుతో బళ్లారి వెళ్తున్న ఓ లారీ మరో లారీని ఓవర్టేక్ చేసే సమయంలో జరిగిన ప్రమాదం.

* రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపట్నం మండలం పరిధిలోని కొమరవోలు గ్యాస్ గూడెం వద్ద ఈ సంఘటన జరిగింది..

* గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై వాటర్ ట్యాంకర్ ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు……ఏలూరు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు…..బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి తీవ్ర గాయాలు.

* చిలకలూరిపేట మండలం లోని యడవల్లి చప్టావద్ద ఆదివారం కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

* అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.వాషింగ్టన్‌ DC లోని బేస్‌బాల్‌ స్టేడియం వెలుపల దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.బేస్‌బాల్‌ స్టేడియంలో ఆట ప్రారంభానికి ముందు కాల్పుల ఘటన చోటు చేసుకుంది.దీంతో వాషింగ్టన్‌ నేషనల్స్‌, సాన్‌డియాగో మధ్య జరగాల్సిన ఆట రద్దైంది.పోలీసులు స్టేడియం నుంచి ప్రేక్షకులను బయటకు పంపేశారు.