Business

రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ!

రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ!

పూర్తిగా వెండితో రూ.100 నాణెం

పురందేశ్వరిని కలిసిన మింట్ అధికారులు

నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను ఆమెకు చూపించిన వైనం

అధికారులు చూపిన మోడల్ కు పురందేశ్వరి ఓకే

హైదరాబాద్ : త్వరలో భారత ప్రభుత్వం రూ.100 నాణెం తీసుకువస్తోంది. దీన్ని పూర్తిగా వెండితో తయారు చేయనున్నారు. ఈ వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించనున్నారు. దీనికి సంబంధించిన నమూనాపై సూచనలు, సలహాలు తీసుకునేందుకు మింట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని కలిశారు. పురందేశ్వరికి వారు ఈ వెండినాణేన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను చూపించారు. ఈ నమూనాకు పురందేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ రూ.100 నాణెం బయటికి రానుంది.