Sports

భారత్‌కు త్వరలో పాకిస్తాన్ సెక్యూరిటీ ప్రతినిధులు

భారత్‌కు త్వరలో పాకిస్తాన్ సెక్యూరిటీ ప్రతినిధులు

ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఫురుషుల వన్డే ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. నవంబర్ 19వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఈ మెగా‌టోర్నీ మ్యాచ్‌లు దేశంలోని పది స్టేడియాల్లో జరుగుతాయి. ఇప్పటికే ఏఏ స్టేడియాల్లో ఏరోజు ఏఏ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందో షెడ్యూల్‌నుసైతం ఐసీసీ విడుదల చేసింది. ఈ ప్రపంచ కప్‌లో పొరుగు దేశం పాకిస్థాన్ జట్టుకూడా ఆడుతుంది. అయితే, భారత్‌లో పలు స్టేడియాల్లో తమ జట్టు ఆడదని, ఆ స్టేడియాల్లో పాక్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. కానీ ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలో భారత్‌లో పాక్ జట్టు ప్రయాణానికి క్లియరెన్స్ ఇచ్చే ముందు వేదికలను పరిశీలించడానికి పాకిస్థాన్ భద్రతా ప్రతినిధి బృందాన్ని ఇండియాకు పంపించనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌ని ఎన్నుకున్న తర్వాత భద్రతా ప్రతినిధి బృందాన్ని భారత్ కు ఎప్పుడు పంపాలో విదేశాంగ, అంతర్గత మంత్రిత్వ శాఖతో సహా ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఇంటర్ – ప్రావిన్షియల్ కో- ఆర్డినేషన్ (స్పోర్ట్స్) మంత్రిత్వ శాఖలోని అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ ఆడే వేదికలను, ప్రపంచ కప్ లో వారి కోసం ఏర్పాటు చేసిన భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించడానికి భద్రతా ప్రతినిధి బృందం పీసీబీ నుండి ప్రాతినిధ్యం వహిస్తుందని సదరు అధికారి తెలిపారు.

అక్టోబర్ 15న భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ వేదిక చెన్నైతో పాటు పాకిస్థాన్ మ్యాచ్ ఆడే బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను పాక్ నుంచి వచ్చే ప్రతినిధుల బృందం సందర్శిస్తుంది.

పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్‌ల వివరాలు:

అక్టోబర్ 6: పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్ (హైదరాబాద్)
అక్టోబర్ 12: పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్ (హైదరాబాద్)
అక్టోబర్ 15: పాకిస్థాన్ వర్సెస్ భారత్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 20: పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (బెంగళూరు)
అక్టోబర్ 23: పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్ 27: పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా (చెన్నై)
అక్టోబర్ 21: పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (కోల్‌కతా)
నవంబర్ 5: పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ (బెంగళూరు)
నవంబర్ 12: పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (కోల్‌కతా