Business

హోమ్‌లోన్‌లపై ఎస్‌బీఐ ఆఫర్-TNI నేటి వాణిజ్య వార్తలు

హోమ్‌లోన్‌లపై ఎస్‌బీఐ ఆఫర్-TNI నేటి వాణిజ్య వార్తలు

జియో వినియోగదారులకు అదిరే ఆఫర్

రిలయన్స్ జియో ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని రకాల ప్రీపెయిడ్ ప్లాన్లపై అదనపు ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ వివరాలను కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. రూ.299 ప్లాన్ లో రోజువారీ 2జీబీ ఉచిత డేటాను పొందొచ్చు. ఉచిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా పొందొచ్చు. దీనికి అదనంగా 7జీబీ డేటాను ఉచితంగా ఇస్తోంది. ఈ ప్లాన్ కాల వ్యవధి 28 రోజులు.ఇక రూ.749 ప్లాన్ లో రోజువారీ 2జీబీ ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వీటితోపాటు 14జీబీ డేటా అదనంగా లభిస్తోంది. దీని గడువు 90 రోజులు. రూ.2,999 ప్లాన్ ఏడాది వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో రోజువారీ 2.5 జీబీ ఉచిత డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. వీటికి అదనంగా 21జీబీ ఉచిత డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి మెక్ డొనాల్డ్ మీల్ పై ఆఫర్ ఉంది. రిలయన్స్ డిజిటల్ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు

వాహనదారులు ఎక్కువగా వినియోగించే గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ప్రతి నెల 1 తేదీన సవరిస్తుంటారు. కానీ, కొన్ని నెలల నుంచే ఈ ధరల్లో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధరలు: రూ. 109.66,లీటర్ డీజిల్ ధరలు: రూ. 98.31 విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ రేట్లు: రూ. 110.48,లీటర్ డీజిల్ ధరలు: రూ. 98 విజయవాడ:లీటర్ పెట్రోల్ ధరలు: రూ. 111.76,లీటర్ డీజిల్ ధరలు: రూ.99

70 వేల లోపు ధరలలో సూపర్ బైక్స్

మీరు బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? మీ బడ్జెట్ తక్కువగా ఉందా? మరేం పర్వాలేదు. తక్కువ బడ్జెట్‌లోనే ఎక్కువ మైలేజీ ఇచ్చే.. సూపర్ బైక్స్‌కు సంబంధించిన సమాచారం ఇవాళ మీకోసం తీసుకువచ్చాం. ఇది మాత్రమే కాదు.. ఈ బైక్‌ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొనుగోలు చేసిన వెంటనే బైక్ మీ వద్దకు చేరుకుంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో.. టాప్ బ్రాండ్ బైక్‌లపై అద్భుతమైన ఆఫర్స్ లభిస్తోంది. భారీ తగ్గింపుతో మీరు ఈ బైక్స్‌ను కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు.. బైక్ కొనుగోలుపై వివిధ బ్యాంకుల ద్వారా డిస్కౌంట్ కూడా లభిస్తోంది. మరి ఆ బైక్స్ ఏంటి? ఆ ఆఫర్స్ ఏంటి? ఆ వివరాలు ఓసారి చూసేయండి.హీరో HF డీలక్స్..బ్లాక్ అండ్ రెడ్ కలయిక బైక్‌లో.. 97.22 cc ఇంజిన్‌తో హీరో హెచ్‌ఎఫ్ బైక్ అందుబాటులో ఉంది. ఈ బైక్ 65 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ క్లేయిమ్ చేస్తోంది. ఈ హీరో బైక్‌ని కేవలం రూ.59,893కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయడం ద్వారా బ్యాంక్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందువచ్చు.బజాజ్ ప్లాటినా 100..ఈ బైక్‌పై ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. మీరు బజాజ్ ప్లాటినా 100ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూ. 69,638కి కొనుగోలు చేయొచ్చు. ఈ బైక్ గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగంతో వెళ్తుంది. ఇవాళ మీరు ఈ బైక్‌ను ఆర్డర్ చేస్తే, 6-7 రోజుల్లో మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది. మైలేజీ కూడా 70 kmpl మైలేజీని అందిస్తుంది.బజాజ్ CT 110X..బజాజ్ నుంచి వస్తున్న మరో బైక్ ఇది. ఇది కస్టమర్లకు అన్ని విధాలుగా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ బైక్ మీ రోజువారీ అప్-డౌన్ కోసం పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.70,006 లకు సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బైక్ ధరను చెల్లించలేకపోతే, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. అంటే, బైక్ డెలివరీ అయ్యాక కూడా మీరు అమౌంట్‌ను పే చేయొచ్చు. ఇక దీని మైలేజీ 60 నుంచి 70 వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.హీరో HF డీలక్స్ (సెల్ఫ్ స్టార్ట్)..ఫ్లిప్‌కార్ట్‌లో హీరో ఈ సెల్ఫ్-స్టార్ట్ బైక్‌ను కేవలం రూ. 64,121కి మంచి ఆఫర్‌తో సొంతం చేసుకోవచ్చు. నివేదికల ప్రకారం, ఈ బైక్ 70 kmpl మైలేజీని ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ కూడా దీనికి ఉన్నాయి.ఫ్లిక్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసే ఈ బైక్స్ అన్నీ కూడా 6 నుంచి 7 రోజుల్లో కస్టమర్లకు డెలివరీ అవుతాయి. అయితే, డెలివరీ కూడా మీరు పెట్టే లొకేషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ ధరలన్నీ ఎప్పడూ ఒకేలా ఉండకపోవచ్చు. సమయానుకూలంగా మారే అవకాశం ఉంది.

హోమ్‌లోన్‌లపై ఎస్‌బీఐ ఆఫర్

SBI హోమ్‌లోన్ ఆఫర్ | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) గృహ రుణాలపై (గృహ రుణం) ఆఫర్‌ ప్రకటించింది. పండగ స్పెషల్‌ను పురస్కరించుకుని క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. హోమ్‌లోన్‌పై గరిష్ఠంగా 65 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ ఇస్తున్నట్లు బ్యాంక్‌కి ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ రాయితీలు ఇవ్వనున్నారు. త్వరలో గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారు ఈ ఆఫర్‌ను పరిశీలించొచ్చు.ప్రస్తుత వడ్డీ రేట్లు 9.15 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉన్నాయి. క్యాంపెయిన్‌లో భాగంగా 8.6 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంది. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నవారు తక్కువ వడ్డీకే రుణాలు ఆనందించవచ్చు. ప్రస్తుతం ఎక్సటర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేట్‌ (EBR) 9.15 శాతం ఉండగా.. సిబిల్‌ స్కోరు 750 నుచి 800 మధ్య ఉన్నవారికి గరిష్ఠంగా 55 బేసిస్‌ పాయింట్లు రాయితీ లభిస్తాయి. అంటే 8.60 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి.సిబిల్‌ స్కోరు 700- 749 బేసిస్‌ పాయింట్లు ఉన్నవారికి 65 బేసిస్‌ పాయింట్లు రాయితీ లభిస్తుంది. ప్రస్తుతం ఈ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి 9.35 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. క్యాంపెయిన్‌లో భాగంగా 8.70 శాతానికే రుణం లభించనుంది. సిబిల్‌ స్కోరు 650-699 పాయింట్లు ఉన్న వారికి 9.45 శాతం, 550-649 మధ్య ఉన్న వారికి 9.65 శాతం వడ్డీకి రుణాలు ఇస్తారు. అలాగే సిబిల్ స్కోరు 151-200 మధ్య ఉన్న వారికీ, ఎలాంటి క్రెడిట్ స్కోరూ లేని వారికీ 65 బేసిస్ పాయింట్లు రాయితీ ఇస్తున్నారు. అలాగే, గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు రూ.2 వేలు నుంచి రూ.10 వేల మధ్య ఉంటాయి. జీఎస్టీ అదనం. మరిన్ని వివరాలకు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

కొత్త స్టైల్‌లో రానున్న శాంసంగ్ కొత్త సిరీస్

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అప్ కమ్మింగ్  స్మార్ట్‌ఫోన్ సిరీస్ W24 లాంచ్  తేదీని చైనాలో ప్రకటించింది. W24 సిరీస్ W23 సిరీస్‌ను అనుసరిస్తుంది.  W24 అండ్ W24 ఫ్లిప్‌ ఫోన్  కూడా ఈ సిరీస్ లో ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే W సిరీస్‌ని మాత్రమే విడుదల చేయాలని కంపెనీ నిర్ధారించింది. Weiboలో టీజర్ పోస్టర్ ద్వారా లాంచ్ ఈవెంట్ వివరాలను Samsung షేర్ చేసింది.చైనాలోని చెంగ్డు హై అండ్ న్యూ స్పోర్ట్స్ సెంటర్‌లో సెప్టెంబర్ 15న  లాంచ్ కానుంది. Samsung W24 అండ్  W24 ఫ్లిప్ Galaxy Z Fold 5 ఇంకా  Galaxy Z Flip 5  రీబ్రాండెడ్ వెర్షన్ అని ఊహిస్తున్నారు. దీనిని జూలైలో లాంచ్ చేసారు. అయితే W24, W24 ఫ్లిప్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ లేటెస్ట్  Galaxy Z ఫోల్డ్‌కి రీబ్రాండెడ్ వెర్షన్ అని కూడా చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీ తప్ప దక్షిణ కొరియా కంపెనీ 
శాంసంగ్  ఇతర ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ కొత్త W సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉంటాయో  ఒక ఆలోచన ఉంటుంది, ఎందుకంటే ఇవి Galaxy Z Fold 5, Galaxy Z Flip 5   కస్టమైజెడ్  వెర్షన్‌లని ఊహించవచ్చు.Galaxy Z Flip 5కి 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫోల్డబుల్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే  ఉంది, HDR10+ ఇంకా  1080 x 2640 పిక్సెల్‌లకు సపోర్ట్ చేస్తుంది. దానితో పాటు, 3.4-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ద్వారా శక్తిని పొందుతుంది,  25-W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3700mAh బ్యాటరీతో వస్తుంది.కెమెరా ముందు భాగంలో వెనుక భాగంలో డ్యూయల్ 12-మెగాపిక్సెల్ సెటప్ ఇంకా  10-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. మరోవైపు, Galaxy Z Fold 5 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+,  1812 x 2176 పిక్సెల్‌లకు సపోర్ట్ ఇచ్చే 7.6-అంగుళాల ఫోల్డబుల్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను అందిస్తుంది.స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ద్వారా శక్తిని పొందుతుంది, 25-W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ముందు భాగంలో10-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్‌  ఉంది. ఫోల్డబుల్ డిస్‌ప్లేలో 4-మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంది. వెనుకవైపు, Galaxy Z Fold 5లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. రాబోయే డబ్ల్యూ24, డబ్ల్యూ24 ఫ్లిప్‌ ఈ స్పెసిఫికేషన్‌లు ఉన్నట్లు చెబుతున్నారు.

*   ఐఫోన్ 15 నుంచి యూజర్లు కొత్త కేస్ 

యాపిల్ ఐఫోన్ 15 నుంచి యూజర్లు కొత్త కేస్ ను చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న లెదర్ కేసును యాపిల్ తొలగించనుందన్నది తాజా సమాచారం. పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ కేసును తీసుకురానుంది. ఇందుకు సంబంధించి కొన్ని లీకైన ఇమేజ్ లు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. యాపిల్ కొత్తగా తీసుకురాబోయే కేస్ మెటీరియల్ కూడా చూడ్డానికి, తాకితే అచ్చం లెదర్ మాదిరే ఉంటుంది. కాకపోతే దీన్ని జంతు చర్మంతో తయారు చేయరు.ప్రస్తుతం ఉన్న లెదర్ కేసును యాపిల్ 2013లో ఐఫోన్ 5ఎస్ తో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిజైన్, రంగుల పరంగా పలు మార్పులు చేశారు. పర్యావరణ అనుకూల మెటీరియల్ తో కొత్త కేస్ ను తయారు చేసినట్టు సమాచారం. కాకపోతే ఎలాంటి మెటీరియల్స్ ను తయారీలోకి వినియోగించారన్న వివరాలు లేవు. మరి యాపిల్ తీసుకొచ్చే కొత్త కేస్ ఎలా ఉంటుందో చూడాలంటే పది రోజులు ఆగాల్సిందే. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 12న ఆవిష్కరించొచ్చని తెలుస్తోంది.

నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

సాధారణంగా ఇంట్లో ఏ శుభకార్యం అయినా మహిళలు బంగారంను కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో గత కొద్ది రోజుల నుంచి బంగారం రేట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. నేడు పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.నేటి బంగారం ధరలు హైదరాబాద్‌‌లో ఎంతటే:22 క్యారెట్ల బంగారం ధర- రూ.55,300.24 క్యారెట్ల బంగారం ధర- రూ. 60,300..నేటి బంగారం ధర విజయవాడ ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర- రూ.55,300,24 క్యారెట్ల బంగారం ధర- రూ. 60,300

*  మాస్క్‌ను చంపేస్తారేమోనంటూ ఆయన తండ్రి ఎరల్‌ మాస్క్‌ ఆందోళన 

 టెస్లా, ఎక్స్‌ (ట్విటర్‌) అధినేత, బిలియనీర్‌ ఎలాన్‌ మాస్క్‌ (ఎలోన్‌ మస్క్‌)ను చంపేస్తారేమోనంటూ స్వయంగా ఆయన తండ్రి ఎరల్‌ మాస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాన్‌ మాస్క్‌ (ఎలోన్‌ మస్క్‌) అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నారంటూ ‘ది న్యూ యార్కర్‌’ ప్రచురించిన ఓ కథనాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ది న్యూ యార్కర్‌ ‘ఎలాన్‌ మాస్క్‌ షాడో రూల్‌’ పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. అంతరిక్షం, ఉక్రెయిన్, సామాజిక మాధ్యమాలు, విద్యుత్ వాహనాల వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మాస్క్‌ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో మాస్క్‌ స్టార్‌లింక్‌ ఉపగ్రహ సేవలు ఎంత కీలకంగా వ్యవహరించాయో కూడా పత్రిక ఉటంకించింది. మరోవైపు ‘విదేశాలతో మాస్క్‌లను పరిశీలించాల్సి ఉంది’ అంటూ ట్విటర్‌ కొనుగోలు సమయంలో అధ్యక్షుడు బైడెన్‌ చేసిన వ్యాఖ్యలనూ న్యూ యార్కర్‌ ఈ సందర్భంగా గుర్తు చేసింది.ఈ కథనాన్ని ఉద్దేశిస్తూ.. ఇది ఎలాన్‌ మాస్క్‌పై దాడే అని ఎరల్‌ ‘ది సన్‌’ మీడియాతో మాట్లాడుతూ ఎరాల్‌ అన్నారు. ”షాడో ప్రభుత్వ” మద్దతుతోనే ఇది జరుగుతోందని అనుకూలంగా. ”ఈ షాడో ప్రభుత్వమే ఎలాన్‌ మాస్క్‌ను అంతం చేస్తుందని మీరు భయపడుతున్నారా?” అని అడిగిన ప్రశ్నకు ఆయన ”అవును” అని సమాధానమివ్వడం. ట్విటర్‌ కొనుగోలు విషయంలో మాస్క్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఈ సామాజిక మాధ్యమ వేదికపై విద్వేషపూరిత సందేశాలను అనుమతిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.మరోవైపు ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్‌ సేవను అందించడంపై రష్యా స్పేస్‌ ఏజెన్సీ చీఫ్‌ దిమిత్రి రోగోజిన్‌.. మాస్క్‌ను కొన్ని నెలల క్రితం బెదిరించిన విషయం తెలిసిందే. దీన్ని అప్పట్లో మాస్క్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత రోగోజిన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తొలగించడం. మరోవైపు మాస్క్‌ నిత్యం అంగరక్షకుల పర్యవేక్షణలో ఉంటున్నారని ఎక్స్‌ ఉద్యోగులు కొన్ని నెలల క్రితం ఓ ప్రధాన మీడియా సంస్థతో అన్నారు. బహుశా కీలకమైన కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు, మార్పుల నేపథ్యంలో ఇది తప్పడం లేదోమోనని వారు అప్పట్లో సంభవించారు.

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ ధరలను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరట కలిగించిన విషయం తెలిసిందే. అలాగే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రేట్లను తగ్గించారు.హైదరాబాద్: రూ. 955,వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912.విజయవాడ: రూ. 927,గుంటూర్: రూ. 944