Politics

కర్నాటక ఎన్నికలలో జెడిఎస్ కుమారస్వామి కి మద్దతు కెసిఆర్ నిర్ణయం.

కర్నాటక ఎన్నికలలో జెడిఎస్ కుమారస్వామి కి మద్దతు కెసిఆర్ నిర్ణయం.

కర్ణాటక శాససనభ ఎన్నికల వేళ భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి ధృవీకరించారు.
కర్ణాటక ఎన్నికల్లో 59 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అవుతానని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలో ఎవరితో పొత్తు పెట్టుకుంటారని విలేకరులు ప్రశ్నించారు. అయితే తాము ఏ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేది ముందుగా చెప్పలేమని కుమారస్వామి తెలిపారు. జేడీఎస్ ఇప్పటికే 97 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించగా, కాంగ్రెస్ 165 మంది పేర్లను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది.

224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.

కర్ణాటక లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.