తొంభైయవ దశకంలో జేడీ చక్రవర్తి పేరు తెలియని వారుండరు. మనీ మనీ, గులాబి, దెయ్యం, బాంబే ప్రియుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో తెలుగునాట అప్పట్లో ఓ సెన్సేషన్ అయ్యాడు. ఆ తర్వాత అనూహ్యంగా విలన్గా మారి కొన్ని సినిమాల్లో మెరిసాడు. ఒకానొక టైమ్లో మెగాఫోన్ పట్టి సినిమాలు కూడా తెరకెక్కించాడు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న చక్రవర్తికి ఉన్నట్టుండి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ వచ్చాడు. ఇక ఈ మధ్య అసలు తెలుగు సినిమాల్లో కనిపించడమే లేదు. అయితే ఇతర భాషల్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్లతో బిజీగా గడుపుతున్నాడు.
నేను ఒకప్పుడు ఒక కషాయం తాగేవాడిని. ఆరోగ్యం కోసమని నాతో ఒక వ్యక్తి అది తాగించేవాడు. ఒకసారి ఖాసిం అనే నిర్మాత ఆ కషాయం తాగుతానన్నాడు. అది తాగాక రెండు రోజులు తీవ్ర జ్వరం వచ్చింది. నాకా కషాయం ఇస్తున్న వ్యక్తికి విషయం చెబితే.. నీకోసం చేసిందాన్ని వేరే వాళ్లకు ఎందుకు ఇచ్చావు అని కోప్పడ్డాడు. మా మధ్య దాని మీద పెద్ద గొడవ జరిగింది. చివరికి ఆసుపత్రిలో తేలిందేంటంటే నాకు ఎనిమిది నెలల పాటు స్లో పాయిజన్ ఇచ్చారు. అందు వల్లే నాకు శ్వాస కోశ ఇబ్బందులు వచ్చాయి. దాన్ని వేరే వ్యక్తి తాగితే అతడికి మందు కొట్టే అలవాటు ఉండటం వల్ల తన శరీరం తట్టుకోలేకపోయిందని సంచలన విషయాన్ని బయటపెట్టాడు.