Business

విమానంలో వాటర్ లీకేజీ

విమానంలో వాటర్ లీకేజీ

విమానంలో క్యాబిన్‌ పైకప్పు నుంచి ఏర్పడిన నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బంది పడిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. లండన్‌లోని గాట్విక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమృత్‌సర్‌ బయల్దేరిన ‘ఎయిర్‌ ఇండియా’ విమానంలో ఈ పరిస్థితి ఎదురైంది. దీన్ని అనూహ్య ఘటనగా పేర్కొన్న విమానయాన సంస్థ.. జరిగిన దానిపై విచారం వ్యక్తం చేసింది. ఎయిరిండియా విమానం (ఏఐ 169).. నవంబరు 24న గాట్విక్‌ నుంచి అమృత్‌సర్‌కు బయల్దేరింది. అంతలోనే ప్రయాణికులు కూర్చునే క్యాబిన్‌ పైకప్పు నుంచి ఒకచోట నీటి లీకేజీ మొదలైంది. నీళ్లు ధార కట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z