Politics

జనసేనతో సమన్వయానికి టీడీపీ కమిటీ

జనసేనతో సమన్వయానికి టీడీపీ కమిటీ

జనసేనతో సమన్వయం కోసం తెదేపా ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీ సభ్యులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. తెదేపా-జనసేన కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేయనుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని రెండు పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి.

తెదేపాతో సమన్వయం చేసుకునేందుకు జనసేన పార్టీ తరఫున ఇప్పటికే ఒక కమిటీని ప్రకటించారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా పనిచేసిన ఆయన అనుభవం ఇందుకు ఉపయోగపడుతుందన్నారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z