Politics

2024 ఎన్నికలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి జోస్యం.. వైసీపీకి జరిగిదే అదేనంటా..!

2024 ఎన్నికలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి జోస్యం.. వైసీపీకి జరిగిదే అదేనంటా..!

వైసీపీ నుంచి సస్పెండ్​ అయిన నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

– 2024లో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ భవితవ్యంపై జోస్యం చెప్పారు.

★ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

★ మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి.. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో దెబ్బ మీద దెబ్బ పడ్డట్లైంది.

★ నమ్ముకున్న ఎమ్మెల్యేలే తమని మోసం చేశారని నమ్మిన వైసీపీ.. నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది.

★ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24గంటలు కూడా కాకముందే ఎమ్మెల్యేలపై అధికార పార్టీ వేటు వేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

★ తాజాగా పార్టీ నుంచి సస్పెండ్​ అయిన నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి 2024లో జరగబోయే ఎన్నికల గురించి జోస్యం చెప్పారు.

★ “ముఖ్యమంత్రి జగన్​ నన్ను అనుమానించారు. ఆ తర్వాత వైసీపీకి దూరం జరుగుతున్నట్లు రెండు నెలల ముందే చెప్పా. ప్రజాసమస్యల గురించి ప్రశ్నిస్తే.. వాటిని రాజకీయ కోణంలో చూసి అనుమానించారు. అందుకే నేను దూరం జరిగా” అని నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే, కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి అన్నారు.

★ 2024లో రాష్ట్రంలో రాజకీయ సునామీ రాబోతోందని.. ఆ సునామీలో వైసీపీ డిస్మిస్‌ అవుతుందని.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జోస్యం చెప్పారు.

★ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు సంకేతాలని స్పష్టం చేశారు.

★ చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని కోటంరెడ్డి తెలిపారు.

★ కొందరు బహిరంగంగా బయటకు వస్తున్నారని.. చాలా మంది లోపల ఉడికిపోతున్నారని విమర్శించారు.

★ మరో పార్టీ కోసం ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని తెలిపారు.

★ రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికలకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

★ “వైసీపీ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు బయటికి వస్తారో నాకు తెలియదు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న మాట నిజం. కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా ముందుకు వచ్చారు. మరికొంతమంది లోపల రగిలిపోతున్నారు” అని నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే, కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి అన్నారు.

★ రానున్న 2024 ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ ప్రజా సునామీ రాబోతుంది.

★ ప్రజలు కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా వైసీపీను ప్రజలు శాశ్వతంగా బహిష్కరించనున్నారని.. తడ నుంచి ఇచ్ఛాపురం వరకు వైసీపీ ఓటమి పాలవుతుందని శ్రీధర్ రెడ్డి విమర్శించారు.

★ చాలా మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని స్పష్టం చేశారు. అయితే సస్పెండ్​పై స్పందించిన కోటంరెడ్డి.. వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమని.. కానీ ఆ విధానం మాత్రం ప్రజాస్వామిక సూత్రానికి విరుద్ధం అని తెలిపారు.

★ షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్​ చేయకూడదని పేర్కొన్నారు.

★ డబ్బులకు అమ్ముడుపోయినట్లు సజ్జల మాట్లాడటం సరికాదన్నారు.

★ టీడీపీ, జనసేన నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలకు మీరు ఎంత ఇచ్చి కొన్నారో చెప్పాలని నిలదీశారు.

★ “”ప్రజలు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీని శాశ్వతంగా బహిష్కరిస్తారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా సునామీ రాబోతుంది. ఆ సునామీలో వైసీపీ కొట్టుకుపోతుందని ఘంటాపథంగా చెపుతున్నా” అని నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే, కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి అన్నారు.