ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ రాజకీయ నేత పొన్నాల లక్ష్మయ్య మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్కు వచ్చిన పొన్నాల దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి కాసేపు మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
పార్టీలో తగిన గౌరవం దక్కలేదంటూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పొన్నాల.. ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీని అమ్మకానికి పెట్టి ఒక వ్యాపార వస్తువులా మార్చేశారని, కాంగ్రెస్లో బీసీలకు అవమానం జరుగుతోందని, వాటిని తట్టుకోలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు. అనంతరం మంత్రి కేటీఆర్ శనివారం పొన్నాలను కలిసి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్తో పొన్నాల భేటీ అయ్యారు.
👉 – Please join our whatsapp channel here –